ముంబై: మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే (Dhananjay Munde)కు కరోనా సోకింది. పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆయన కార్యాలయం తెలిపింది. అయితే వేరియంట్ వివరాలు వెల్లడించలేదు. నాగ్పూర్లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజైన డిసెంబర్ 20న మంత్రి ధనంజయ్ ముండే కరోనా బారినపడినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. దీంతో తన ఇంట్లో ఐసొలేషన్లో ఉన్నారని, వైద్యుల సూచనలు పాటిస్తున్నారని పేర్కొంది. ముండేకు ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన శాఖ వ్యవహారాలు చూస్తున్నారని వెల్లడించింది.
కాగా, మంత్రి ధనంజయ్ ముండే కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది అనారోగ్యానికి గురయ్యారు. అయితే వారికి కరోనా లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఆ సిబ్బందిని ఐసొలేషన్లో ఉంచినట్లు చెప్పారు.
మరోవైపు మహారాష్ట్రలో ఆదివారం కొత్తగా 50 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 9 కేసులు జేఎన్.1 వేరియంట్గా గుర్తించారు. దీంతో మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసుల సంఖ్య పదికి పెరిగింది.