Omicron Effect : కరోనా వైరస్ తాజా వేరియంట్ ఒమిక్రాన్తో థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందని, జనవరి మూడో వారం నాటికి మహారాష్ట్రలో 80 లక్షల కేసులు, 80,000 మరణాలు సంభవించే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. థర్డ్ వేవ్లో కొవిడ్-19 కేసులు భారీగా నమోదవుతాయని జిల్లా కలెక్టర్లు, ఆరోగ్య శాఖ అధికారులకు రాసిన లేఖలో మహారాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి (ఆరోగ్య) డాక్టర్ ప్రదీప్ వ్యాస్ పేర్కొన్నారు.
థర్డ్ వేవ్లో 80 లక్షల కొవిడ్-19 కేసులు వెలుగుచూస్తే 1 శాతం మరణాలు నమోదైనా 80,000 మంది మరణిస్తారని డాక్టర్ వ్యాస్ ఆ లేఖలో అంచనా వేశారు. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత వల్ల మూడో వేవ్ను తేలికగా తీసుకోవద్దని వ్యాక్సిన్ తీసుకోని వారి ఇతర వ్యాధులతో బాధపడేవారికి థర్డ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంటుందని అన్నారు.
మహారాష్ట్రలో తాజాగా మరోసారి లాక్డౌన్ విధించే సమయం ఇదేనని దీనిపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఓ నిర్ణయం తీసుకుంటారని అంతకుముందు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ వదెట్టివార్ స్పష్టం చేశారు. గత 11 రోజులులగా మహారాష్ట్రలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి.
మరోవైపు భారత్లో గడిచిన 24 గంటల్లో 22,775 కరోనా కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి 406 మంది మరణించారు. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 454 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా ఢిల్లీలో 351 కేసులు నమోదయ్యాయి.