ముంబై: ఒక వ్యక్తి చేపలు పట్టేందుకు నదిలోకి దిగాడు. అయితే ఆ నదిలో ఉన్న షార్క్ ఆ వ్యక్తి కాలు కొరికింది. (Shark Bites Man’s Leg) కాలు తెగిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మత్స్యకారులు వలతో ఆ షార్క్ను పట్టి చంపి ఒడ్డుకు తెచ్చారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అరేబియా సముద్రంలోకి పారే వైతరుణి నదిలో చేపలు పట్టేందుకు 32 ఏళ్ల విక్కీ సురేష్ గోవారి అందులోకి దిగాడు. అయితే ఆ నదిలో ఉన్న షార్క్ అతడిపై దాడి చేసింది. కుడి కాలును కొరికేయడంతో అది తెగింది. తీవ్రంగా గాయపడి రక్తం ధారంగా కారడంతో అతడు అచేతనంగా పడిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, నదిలో షార్క్ తిరుగడం చూసి స్థానికులు భయాందోళన చెందారు. స్థానిక మత్స్యకారులు వలలతో ఒక షార్క్ను బంధించి ఒడ్డుకు తెచ్చి చంపారు. ఈ వీడియోతోపాటు నదిలో తిరుగుతున్న షార్క్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో సముద్రానికి సమీపంలో ఉన్న ఆ నదిలో షార్కులు ఎన్ని ఉన్నాయో? అని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
पालघर येथील वैतरणा खाडीत मासेमारी करण्यासाठी गेलेल्या तरुणावर अचानक शार्क माशाने हल्ला चढवला. 200 किलोहून अधिक वजनाच्या माशाने थेट तरुणाच्या पायाचा लचकाच तोडला.#palghar #SharkAttack #viralvideo #Maharashtra pic.twitter.com/nOVMchI8dR
— Satish Daud Patil (@Satisdaud0705) February 14, 2024