పుణె, మార్చి 17: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకటన వెలువడి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత కూడా ప్రధాని మోదీకి చెందిన చిత్రాలు పలు బహిరంగ ప్రదేశాల్లో కనిపించడంపై మహారాష్ట్రలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పుణెకు చెందిన న్యాయవాది ఆశిమ్ సరోద్, పర్యావరణవేత్త, విశ్వంభర్ చౌదరి ఎన్నికల సంఘానికి శనివారం లీగల్ నోటీసులు పంపారు. మహారాష్ట్రలోని పలు బహిరంగ ప్రదేశాల్లో పీఎం మోదీ, మహారాష్ట్ర ఇద్దరు డిప్యూటీ సీఎంల చిత్రపటాలు దర్శనమిస్తున్నాయని, ఈసీ జోక్యం చేసుకోవాలన్నారు.