న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షో భం నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్లోనూ మహారాష్ట్ర పరిస్థితులే ఉత్పన్నం కావచ్చన్నారు. బీహార్లో కొందరు జేడీ(యూ) ఎమ్మెల్యేలు నితీశ్పై, యూపీలో సమాజ్వాదీ ఎమ్మెల్యేలు అఖిలేశ్ యాదవ్పైనా అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. యూపీలో జయంత్ చౌదరీ ఎన్డీయేలో చేరవచ్చని, సమాజ్వాదీ ఎమ్మెల్యేల్లో బేదాభిప్రాయాలు ఏర్పడొచ్చని చెప్పారు. జేడీ(యూ)లో తిరుగుబాటు వాతావరణం నెలకొందని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అభిప్రాయపడ్డారు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీతోనూ, ఇతర పార్టీలతోనూ చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీని నితీశ్ వారసుడిగా, రాహుల్ను విపక్ష ఐక్య కూటమి నాయకుడిగా కొందరు జేడీ(యూ) నేతలు అంగీకరించలేకపోతున్నారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్లోనూ చీలిక మహారాష్ట్రకు చెందిన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడొచ్చని శివసేన (షిండే వర్గం) నేత గులాబ్ రఘునాథ్ పాటిల్ సంచలన ప్రకటన చేశారు.