ముంబై, నవంబర్ 2: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బంధువులకు చెందిన సుమారు రూ.1,400 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ జప్తు చేసింది. ముంబై, ఢిల్లీ, పుణె, గోవాలోని ఆస్తులతో పాటు మహారాష్ట్రలో దాదాపు 25 ప్రాంతాల్లోని భూములు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో సతారాలోని చక్కెర ఫ్యాక్టరీ (విలువ రూ.600 కోట్లు), గోవాలోని ఓ రిసార్ట్ (విలువ రూ.250 కోట్లు) ముఖ్యమైనవి. అజిత్ పవార్ బంధువుల ఆస్తులపై గత నెలలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు మంగళవారం బినామీ ఆస్తుల చట్టం కింద జప్తు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు,మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు ముంబై కోర్టు మంగళవారం రిమాండ్ విధించింది.