ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఇటీవల హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్లో జరిగిన వెన్నెముక సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని సీఎంఓ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఠాక్రే ప్రస్తుతం ఆస్పత్రిలో ఫిజియోథెరఫీ చేయించుకుంటున్నారని ఆయన కొద్దిరోజుల్లో డిశ్చార్జి అవుతారని వెల్లడించింది.
రిలయన్స్ హాస్పిటల్లో ఠాక్రేకు డాక్టర్ అజిత్ దేశాయ్, డాక్టర్ శేఖర్ భోజ్రాజ్లు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. వృత్తి రీత్యా డాక్టర్ అజిత్ దేశాయ్ కార్డియాలజిస్ట్ కాగా, డాక్టర్ భోజ్రాజ్ స్పైన్ సర్జన్లని సీఎంఓ పేర్కొంది.