ముంబై: మహారాష్ట్ర బీజేపీ మంత్రి విజయ్కుమార్ గవిట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీ కళ్లు ఐశ్వర్యరాయ్ కళ్లులా అందంగా ఉండాలంటే రోజూ చేపలు తినాలని ప్రజలకు సూచించారు. ‘రోజూ చేపలు తినే వారి చర్మం మృదువుగా ఉంటుంది. వారి కళ్లు మెరుస్తాయ్. ఐశ్వర్యరాయ్ మంగళూరులో సముద్ర తీరానికి దగ్గరలో నివసించేవారు. ఆమె రోజూ చేపలు తినేవారు. మీ కళ్లు కూడా ఆమె కళ్లులా అందంగా మెరవాలంటే రోజూ చేపలు తినండి’ అని సూచించారు.