ముంబై : ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల్ని ప్రారంభించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాన్ మస్క్కు చెందిన ‘స్టార్లింక్’తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఎలాన్ మస్క్ శాటిలైట్ కమ్యూనికేషన్ వెంచర్లో భాగస్వామ్యాన్ని పొందిన తొలి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.
ఈ మేరకు బుధవారం స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఫడ్నవీస్ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసింది.