ముంబై: మహారాష్ట్రలోని భివాండి పట్టణంలో ఓ భవనం కుప్పకూలింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో స్థానిక అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కాగా, ఆ భవనంలో నివసించే 10 మంది శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెబుతున్నారు.
Maharashtra | A building collapsed in Bhiwandi area. 10 people feared trapped. Police team including fire brigade and disaster left for the spot.
More details awaited. pic.twitter.com/xqdw2ULtXu
— ANI (@ANI) April 29, 2023