పుణె: మహారాష్ట్రలోని పుణెలో ప్రసిద్ధిగాంచిన దగడూ సేఠ్ వినాయక ఆలయం హోలీ సందర్భంగా ద్రాక్ష పండ్లతో ముస్తాబైంది. సుమారు 2 వేల కిలోల నలుపు, ఆకుపచ్చని ద్రాక్షలతో ఆదివారం ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. సంకటహర చతుర్ది రోజున ద్రాక్ష మహోత్సవ్ను వైభవంగా జరుపుకుంటారు. గణపతి వద్ద ఉంచిన పండ్లను భక్తులు, పలు సంస్థలతో పాటు నసూన్ దవాఖాన, పితాశ్రీ వృద్ధాశ్రమాలకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు.