ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాలేశ్వరుడి ఆలయంలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆలయం గర్భగుడిలో జరిగిన ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో స్పందిస్తూ.. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమని అన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పరిపాలనా విభాగం.. బాధితులకు సాయం చేయడంలో నిమగ్నమైనట్లు ప్రధాని మోదీ తెలిపారు.
उज्जैन के महाकाल मंदिर में हुई दुर्घटना अत्यंत पीड़ादायक है। इस हादसे में घायल सभी श्रद्धालुओं के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 25, 2024
ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం మోహన్ యాదవ్ కలిశారు. ప్రధాని మోదీ ఫోన్ చేశారని, బాధితుల యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రపతి ముర్ము కూడా ఆ ప్రమాదం పట్ల ఆరా తీసినట్లు ఆయన వెల్లడించారు.