న్యూఢిల్లీ, డిసెంబర్ 13: మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్(43)ను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ నోటీస్ ఆధారంగా ఈ అరెస్ట్ జరిగిందని ఈడీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఉప్పల్ను ఇండియాకు రప్పించేందుకు దుబాయ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఉప్పల్తోపాటు మరో ప్రధాన నిందితుడైన సౌరభ్ చంద్రకర్పై రూ.6 వేల కోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్లో ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఛత్తీస్గఢ్ మొదటి విడత ఎన్నికల సమయంలో మహదేవ్ యాప్ ప్రమోటర్లు అప్పటి ఛత్తీస్గఢ్ సీఎం బఘేల్, ఇతర సీనియర్ నాయకులకు రూ.508 కోట్లు చెల్లించారని ఈడీ తెలిపింది.