Mallikarjun Kharge | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై బిహార్లోని ముజఫర్పూర్ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. ఈ కేసులో మధ్యప్రదేశ్లోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుంభమేళా స్నానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్థానిక న్యాయవాది సుధీర్ ఓజా కోర్టులో ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మనోభావాలను దెబ్బ తీశారని ఆయన ఆరోపించారు. రాజకీయ లాభం కోసం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు సనాతన హిందువుల మనోభావాలతో ఆటలాడారన్నారు. ఖర్గే వ్యాఖ్యలు హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 3న విచారించేందుకు కోర్టు నిర్ణయించింది. ఫిర్యాదులో మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు ప్రజాశాంతికి భంగం కలిగించినట్లు ఆరోపించారు.
కేసుపై కాంగ్రెస్ అధ్యక్షుడు స్పందించలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో సోమవారం స్నానం చేశారు. దీనిపై మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. గంగానదిలో స్నానం చేయడం వల్ల పేదరికం అంతమవుతుందా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కెమెరాల కోసం స్నానం చేసేందుకు పోటీపడుతున్నారని ఆరోపించారు. మోవ్లో జరిగిన ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, తాను ఎవరి విశ్వాసాలను ప్రశ్నించడం లేదన్న ఆయన.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణలు చెబుతున్నానన్నారు. పిల్లలు ఆకలితో చనిపోతున్నారని.. పాఠశాలలకు వెళ్లడం లేదని.. కార్మికులకు జీతాలు అందడం లేదన్న ఆయన.. వేలాది రూపాయలు ఖర్చు చేసి గంగానదిలో స్నానం చేసేందుకు పోటీపడుతున్నారన్నారు. దేవుడిపై తనకు నమ్మకం ఉందన్న ఆయన.. మతం పేరుతో పేదలను దోపిడీ చేయడాన్ని సహించబోమన్నారు.
Mauni Amavasya: రేపే మౌనీ అమావాస్య.. ఒక్క రోజే కుంభమేళాలో 10 కోట్ల మంది పుణ్య స్నానాలు