ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రమైన మిజోరామ్లో స్వల్ప భూకంపం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి 12.49 గంటలకు ఐజ్వాల్లో (Aizawal) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదయింది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఐజ్వాల్కు 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూ అంతర్భంగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొన్నది. ఈ భకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
గత నెల 29న కూడా మిజోరాంలో భూకంపం వచ్చింది. ఛంపాయ్ జిల్లాలోని 4.2 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఛంపాయ్కు 69 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది.