డిస్పూర్ : అసోంలోని గౌహతిలో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 1.12 గంటలకు రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. గౌహతితో పాటు చుట్టు పక్కనే ఉన్న పలు నగరాలు, పట్టణాల్లోనూ ప్రకంపనలు రాగా.. జనం భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. భూకంపంతో ప్రభావంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. కమ్రుప్ కేంద్రంగా తేజ్పూర్కు 156 కిలోమీటర్ల దూరంలో, భూమికి పదికిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
హర్యానాలో సోనిపేట్లోనూ మధ్యాహ్నం రిక్టర్ స్కేల్పై 3.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు 171 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఏడు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించారు. వేకువ జామున రాజస్థాన్లోని జలోర్లోనూ ప్రకంపనలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. అసోం భూకంప జోన్లో ఉండడంతో తరుచుగా భూకంపాలు వస్తుంటాయని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఏప్రిల్ 28న రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో భూకంపం రాగా.. అసోం, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రభావం కంపించింది. పలు చోట్ల భవనాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.