న్యూఢిల్లీ, జనవరి 25: ప్రింట్ మీడియాకే అత్యంత విశ్వసనీయత ఉన్నదని తాజా సర్వేలో తేలింది. ప్రింట్, టెలివిజన్, వెబ్ మీడియాల్లో ఏది కచ్చితమైన వార్తలను అందిస్తున్నది? ఏది ఫేక్ వార్తలను ప్రమోట్ చేస్తున్నది? అని ప్రముఖ మీడియా కన్సల్టింగ్ కంపెనీ ఓర్మ్యాక్స్ సర్వే నిర్వహించగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 15 రాష్ర్టాల్లోని రెండు వేల మంది పాఠకులను సర్వే చేయగా అన్ని మీడియాల్లోకెల్లా ప్రింట్ మీడియాకే ఎక్కువ ప్రామాణికత ఉన్నదని, పత్రికలు అందించే వార్తలకు ఎక్కువ విశ్వసనీయత ఉన్నదని 62 % మంది చెప్పారు. 55 శాతం మంది టెలివిజన్ ద్వారా ప్రసారమయ్యే వార్తలకు, 52 శాతం మంది రేడియో వార్తలకు కచ్చితత్వం ఉన్నదని వెల్లడించారు. ఇక, దేశవ్యాప్తంగా 65% మంది ఫేక్ వార్తలను చదువుతున్నట్టు చెప్పారు. రాబోయే కాలంలో ఈ ఫేక్ న్యూస్ మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నదని సర్వే తెలిపింది.
విశ్వసనీయత దేనికెంత..
ప్రింట్ 62%
టెలివిజన్ 55%
రేడియో 52%
ట్విట్టర్ 49%
మొత్తంగా సోషల్ మీడియా30%