తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధాన్ని అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయాల పవిత్రతను కాపాడుకొనేందుకు ఈ చర్యలు తీసుకోవాలని సూచించింది.
ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ జే సత్యనారాయణ ధర్మాసనం రాష్ట్ర హిందూ రిలీజియన్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ విభాగానికి శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది.