చెన్నై, మార్చి 15: ఈనెల18న ప్రధాని నరేంద్ర మోదీ కోయంబత్తూరు పర్యటన సందర్భంగా రోడ్ షో నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతినిచ్చింది. నాలుగు కిలోమీటర్ల మేర సాగే ఈ రోడ్షోకు షరతులతో కూడిన అనుమతినివ్వాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
రోడ్షోకు అనుమతి నిరాకరిచండాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత జే రమేష్కుమార్ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు నిరాకరణకు సహేతుకమైన కారణాలు లేవని పేర్కొంది.