భోపాల్ : ఐఆర్సీటీసీఐ అఖారా పరిషత్ మండిపడుతున్నది. వచ్చే నెలలో నిర్వహించనున్న రామాయణ్ యాత్ర ట్రైన్ను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి లేఖ రాసింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7న రామయణ్ సర్క్యూట్ స్పెషల్ ట్రైన్ను ఐఆర్సీటీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రైలు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి 156 మంది ప్రయాణికులతో బయలుదేరింది. దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ‘దేఖో అప్నా దేశ్’ కింద డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును ప్రారంభించింది.
రైలులోని వెయిటర్లకు కాషాయ రంగు యూనిఫాం అందజేయడంపై మధ్యప్రదేశ్ ఉజ్జయినీలోని అఖారా పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయిటర్లు ధరించిన కాషాయ బట్టలు, తలపాగా, రుద్రాక్ష మాలలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. వెంటనే డ్రెస్ కోడ్ను మార్చకుంటే డిసెంబర్ 12న ప్రారంభమయ్యే రాయణ్ సర్క్యూట్ రైలును అడ్డుకుంటామని అఖారా పరిషత్ మాజీ ప్రధాన కార్యదర్శి పరమహంస్ అవధేష్ పూరీ మహారాజ్ హెచ్చరించారు. ఈ చర్యను సంత్ సమాజ్ వ్యతిరేకిస్తుందని, వేలాది మంది హిందువులతో రైలు ముందు ఆందోళన చేపడుతామన్నారు.