BRS Party | భారత్ రాష్ట్ర సమితి పార్టీకి మధ్యప్రదేశ్లో ఆదరణ లభిస్తున్నది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరగా.. తాజాగా ప్రముఖ సామాజిక కార్యకర, వ్యాపమ్ స్కామ్ను వెలుగులోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచిన ఆనంద్ రాయ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనంద్రాయ్ ఆర్టీసీ, ట్రైబల్ రైట్స్ యాక్టివిస్ట్గా ప్రజల ఆదరాభిమానాలు పొందారు.
సామాజిక కార్యకర్తగా వీరికి ప్రజల్లో మంచి పట్టు ఉన్నది. మధ్యప్రదేశ్లో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ‘జై ఆదివాసి యువశక్తి సంఘటన్ (JAYS)’ అనే ప్రముఖ గిరిజన హక్కుల వేదిక బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్లో ఆదివాసి, గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థ పోరాడుతున్నది. ఆనంద్ రాయ్ ఈ సంస్థలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు JAYS ప్రస్తుత అధ్యక్షుడు లాల్ సింగ్ బర్మన్, పంచం భీల్, అశ్విన్ దూబె, గాజీరామ్ బడోలే, కైలాశ్ రాణా బీఆర్ఎస్లో చేరారు.
తెలంగాణ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మానవీయ కోణంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధే ధ్యేయంగా కొనసాగుతున్నాయని జేఏవైఎస్ ఫౌండర్ విక్రమ్ అచ్చాలియా తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్కు తమ జై ఆదివాసి యువశక్తి సంఘటన్ (జేఎవైఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు.
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీల ఆకాంక్షలు నెరవేరలేదని, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారనే విశ్వాసం దేశవ్యాప్తంగా కలుగుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీఆర్ఎస్ ఎదుగుతున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జాయ్స్ జాతీయ అధ్యక్షుడు లోకేష్ ముజాల్దా, మహిళా విభాగం ఇన్చార్జి సీమా వాస్కాలె, మధ్యప్రదేశ్
అధ్యక్షుడు రాందేవ్ కకోడియా ఉన్నారు.