భోపాల్ : మధ్యప్రదేశ్లో (Madhya Pradesh Polls) అధికారం నిలుపుకునేందుకు పాలక బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కలిసివస్తాయని ఆశలు పెంచుకుంటోంది. కాంగ్రెస్ లక్ష్యంగా మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్గపోరుతో సతమతమవుతోందని, మధ్యప్రదేశ్లో ఆ పార్టీ కాస్తా కమల్ నాధ్ కాంగ్రెస్గా మారిందని ఎద్దేవా చేశారు.
అసలు మధ్యప్రదేశ్లో సోనియా కాంగ్రెస్ ఉందా లేక మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ ఉందా అనేది తమకు అర్ధం కావడం లేదని అన్నారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కమల్ నాధ్ కాంగ్రెస్లా మారినట్టు కనిపిస్తోందని, ఆయన సర్వం తానై సర్వేలు నిర్వహిస్తూ, అభ్యర్ధులకు పార్టీ టికెట్లు పంచేస్తున్నారని చౌహాన్ వ్యాఖ్యానించారు. కమల్ నాధ్ చివరికి విపక్ష ఇండియా కూటమిని కూడా నాశనం చేశారని వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అలవికాని హామీలు గుప్పించినా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రజల ఆశీస్సులతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రేమ దుకాణం తెరవలేదని, ఆ పార్టీ అసత్యాల దుకాణం తెరిచిందని ఎద్దేవా చేశారు.
Read More :
Cancer Matrimony | క్యాన్సర్ పేషెంట్ల కోసం స్పెషల్ మ్యాట్రిమోనీ.. దీని వెనుక ఓ కన్నీటి గాథ!