భోపాల్: కరోనా నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వారంలో ఐదు రోజుల పని విధానాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తున్నది. తాజాగా దీనిని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. ఆ రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం శనివారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ‘కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలలో అమలు చేస్తున్న వారంలో ఐదు రోజుల (సోమవారం నుండి శుక్రవారం వరకు) విధుల నిబంధనను 2022 మార్చి 31 వరకు పొడిగించబడింది’ అని అందులో పేర్కొంది.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 22న ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 31 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. ఆ గడువు ముగుస్తున్న నేపథ్యంలో దానిని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది.