భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ (CM Shivraj Singh Chouhan) తన మంత్రివర్గాన్ని (Cabinet expansion) విస్తరించారు. కొత్తగా ముగ్గురికి కేబినెట్లో స్థానం కల్పించారు. వారిలో ఇద్దరుకి కేబినెట్ పదవులు దక్కగా, మరొకరు సహాయ మంత్రి పదవి లభించింది. వీరితో గవర్నర్ మంగుభాయ్ పటేల్ (Governor Mangubhai Patel) రాజ్భవన్లో ప్రమాణం స్వీకారం చేయించారు. దీంతో చౌహాన్ కేబినెట్లో మంత్రుల సంఖ్య 31 నుంచి 34కు చేరింది. అయితే కొత్త మంత్రులు మూడు నెలల మాత్రమే ఆ పదవిలో ఉండనున్నారు. ఎందుకంటే మరో 90 రోజుల్లో సీఎం చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గడువు ముగియనుంది.
అయితే మంత్రివర్గ విస్తరణపై ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) విమర్షనాస్త్రాలు సంధించింది. కొత్తమంత్రులను 1000 గంటల మంత్రులుగా ఎద్దేవా చేసింది. మరికొన్ని రోజుల్లో ప్రభుత్వ గడువు ముగియనుండగా మధ్యప్రదేశ్లో మంత్రివర్గాన్ని విస్తరించారని మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ (Kamal Nath) విమర్శించారు. ఫేర్వల్ ముంగిట బీజేపీ ప్రభుత్వం వెల్కమ్ పాటలు పాడుతున్నదని ఎద్దేవాచేశారు. మొత్తం క్యాబినెట్ మారుతుందని స్పష్టం చేశారు. ఇది మంత్రివర్గ విస్తరణ కాదని, అవినీతి దోస్తాన్ విస్తరణ అని ఆరోపించారు.