హైదరాబాద్ : దాదాపు 580 సంవత్సరాల తర్వాత శుక్రవారం సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం దాదాపు మూడు గంటలు కొనసాగుతుందని ఖగోళ నిపుణులు పేర్కొన్నారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని పేర్కొన్నారు. గ్రహణం వ్యవధి మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుందని.. ఇది 580 ఏళ్లలో సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం అవుతుందని చెప్పారు. ఈ గ్రహణం 1440 ఫిబ్రవరి 18న చివరిసారిగా ఏర్పడిందని.. ఆ తర్వాత 2669వ సంవత్సరంలో ఫిబ్రవరి 8న ఇలాంటి ఘటన కనిపిస్తోందని తెలిపారు.
ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలో కనిపించనుంది. భారత్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు చంద్రోదయం తర్వాత, తూర్పు హోరిజోన్కు చాలా దగ్గరగా పాక్షిక గ్రహణాన్ని, పెనుబ్రల్ గ్రహణాన్ని యూపీ, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కొద్దిగా కనిపిస్తుందని వివరించారు. సూపర్ ఫ్లవర్ బ్లడ్ మూన్ 2021లో మొదటి చంద్రగ్రహణం మే 26న సంభవించింది. వచ్చే ఏడాది నవంబర్ 8, 2022న చంద్రగ్రహణం ఏర్పడనుండగా భారత్లో కనిపిస్తుందని ఖగోళ నిపుణులు తెలిపారు.