న్యూఢిల్లీ, ఆగస్టు 8: పేదల కనీస అవసరాలపై భారీగా పన్నుల విధిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. బడా కార్పొరేట్లకు మాత్రం భారీగా పన్ను రాయితీలిస్తున్నది. కార్పొరేట్ పన్ను తగ్గింపు కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.1,00, 241 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభలో పేర్కొన్నారు. 2019-20లో రూ.1,28,180 కోట్ల రెవెన్యూ లాస్ అయినట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.