తిరుమల: తిరుమలలో (Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీవేంకటేశ్వరునికి హనుమంత వాహన సేవ (Hanumantha Vahana Seva) నిర్వహించారు. తిరుమల మాడవీధుల్లో హనుమంత వాహనంపై ఊరేగిన మలయప్పస్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీవారి వాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక సాయంత్రం 4 గంటలకు పుష్పక విమాన సేవ, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవ జరుగనుంది. మూడేండ్లకు ఒకసారి వచ్చే అధికమాసం సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పక విమాన సేవ నిర్వహిస్తారు.
కాగా, గురువారం సాయంత్రం తిరుమల శ్రీనివాసుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీవారిని దర్శనం చేసుకోవడం శుభప్రదమని భక్తులు నమ్ముతుంటారు.