PM Modi | భువనేశ్వర్: ఒడిశాలోని పూరి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర నోరు జారారు. పూరీ జగన్నాథుడు మోదీ భక్తుడంటూ వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయ దుమారం రేగింది. సంబిత్ పాత్ర వ్యాఖ్యల్ని సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏఐసీసీ-ఒడిశా ఇన్చార్జ్ అజయ్ కుమార్ ఖండించారు.
ఈ అంశంపై సంబిత్ పాత్ర వివరణ ఇస్తూ, ‘పూరి జగన్నాథ్కు ప్రధాని మోదీ గొప్ప భక్తుడు అని చెప్పబోయి.. నోరు జారాను. ఈ అంశాన్ని పెద్దది చేయకండి’ అంటూ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశారు.