ముంబై, ఫిబ్రవరి 16: సమయానికి వీల్చైర్ తేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లిన ఎయిర్ ఇండియా ప్రయాణికుడు కుప్పకూలి మరణించారు. ఈ ఘటన ఈ నెల 12న ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకున్నది.
న్యూయార్క్ నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చిన 80 ఏండ్ల వృద్ధుడు తనకు వీల్చైర్ కావాలని అడిగారు. ప్రస్తుతానికి సరిపడా వీల్చైర్లు లేవని, కాసేపు ఆగాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆయన తన భార్యతో కలిసి ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్దకు వెళ్తుండగా కుప్పకూలారు. సిబ్బంది వెంటనే దవాఖానకు తరలించగా మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.