హైదరాబాద్ : కొవాగ్జిన్ టీకా బూస్టర్ డోస్తో దీర్ఘకాలిక భద్రత ఉంటుందని హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తెలిపింది. శనివారం బూస్టర్ డోస్ ట్రయల్స్ ఫలితాలను కంపెనీ ప్రకటించింది. రెండో డోస్ తీసుకున్న ఆరు నెలల అనంతరం బూస్టర్ డోస్ తీసుకున్న వారిలో తీవ్రమైన ప్రతికూల సంఘటనలు లేవని.. కొవిడ్ను నియంత్రించే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కంపెనీ తెలిపింది.
ఇప్పటికే కొవాగ్జిన్ 2-18 సంవత్సరాల వయస్సు పిల్లలకు సురక్షితమేనని, వైరస్కు వ్యతిరేకంగా తట్టుకోగలదని, రోగనిరోధక శక్తి అందిస్తుందని కంపెనీ డిసెంబర్లో ప్రకటించింది. పిల్లల వ్యాక్సిన్పై భారత్ బయోటెక్ ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా జనవరి 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 15- 18 సంవత్సరాల మధ్య పిల్లలకు కేంద్రం పంపిణీ చేస్తున్నది. అలాగే 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు సైతం కొవాగ్జిన్ వ్యాక్సిన్ వ్యాక్సినేషన్లో వేస్తున్న విషయం తెలిసిందే.