న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో పౌర హక్కుల ఉద్యమం ఉధృతమవుతోంది. పెరిగిన ద్రవ్యోల్బణం, భారీ విద్యుత్ టారిఫ్లు, హక్కుల అణిచివేతకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జాక్) సంచలన ప్రకటన చేసింది. ప్రాంతీయ రాజధాని ముజఫరాబాద్ వైపు భారీ లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూలై 26, 27 తేదీల్లో ఈ నిరసన ఉద్యమం కొనసాగనుందని తెలిపింది.
దాడ్యాల్లో పూర్తి స్థాయి షట్టర్ డౌన్ బంద్ పాటించాలని, మీర్పూర్ డివిజన్లో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉద్యమంలో పాల్గొనాలని ‘జాక్’ నేతలు ఉమర్ నజీర్ కశ్మీరీ, అడ్వకేట్ ఖవాజా మెహ్రాన్ పిలుపునిచ్చారు.