న్యూఢిల్లీ, జనవర్ 12: వారిద్దరూ అన్నదమ్ములు.. సరిహద్దులు వారిని 74 సంవత్సరాల పాటు విడదీశాయి. ఇప్పుడు సరిహద్దులు తెరుచుకోవడంతో ఒకరినొకరు కలుసుకొని బోరున విలపించారు. భారత్-పాక్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటన నెటిజనులను కదిలించింది. 1947లో భారతదేశ విభజన జరిగినప్పుడు మహమ్మద్ సిద్దికీ పసిబాలుడు. విభజనతో వారి కుటుంబం చెల్లాచెదురైంది. తాను పాకిస్థాన్కు వెళ్లిపోయాడు. ఫైసలాబాద్లో స్థిరపడ్డాడు. అన్న హబీబ్ అలియాస్ షేలా ఇండియాలో ఉండిపోయి పంజాబ్లో స్థిరపడ్డాడు. ఇటీవల గురుద్వారా దర్బార్ సాహిబ్ను దర్శించుకునేందుకు వీలుగా కర్తార్పూర్ కారిడార్లో పాకిస్థాన్ భారతీయ ప్రయాణికుల రాకపోకలను అనుమతించింది. దీంతో అన్నదమ్ములు సరిహద్దుల్లో కలుసుకున్నారు. వారు కంటతడి పెట్టిన దృశ్యాన్ని మన్ప్రీత్సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. తన కండ్లల్లో నీళ్లు తిరిగాయని కామెంట్ పెట్టారు.