న్యూఢిల్లీ/ముంబై, మే 30: మహారాష్ట్రలోని చంద్రపూర్ నియోజకవర్గ లోక్సభ సభ్యుడు సురేష్ నారాయణ్ ధనోర్కర్ అలియాస్ బాలు(47) మంగళవారం కన్నుమూశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఉన్న ఏకైక ఎంపీ ఆయన. మే 26న నాగ్పూర్లోని ఓ దవాఖానలో ఆయనకు కిడ్నీలో రాళ్లు తొలగించే సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఆయనకు మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆదివారం గురుగ్రామ్లోని వేదాంత హాస్పిటల్కు హెలికాప్టర్ ద్వారా తరలించారు.
అక్కడ ఆయన పరిస్థితి మరింత విషమించి మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చంద్రపూర్ లోక్సభ స్థానానికి పోటీ చేసి అప్పటి కేంద్రమంత్రి, నాలుగుసార్లు ఈ స్థానం నుంచి గెలిచిన బీజేపీ కీలక నేత హన్స్రాజ్ ఆహిర్పై అనూహ్య విజయం సాధించారు.