Shambhavi Choudhary | న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత పిన్న వయస్కురాలిగా బీహార్కు చెందిన శాంభవి చౌదరి నిలిచారు. 25 ఏండ్ల శాంభవి సమస్తీపుర్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ(రామ్విలాస్) టికెట్పై పోటీచేస్తున్నారు. శాంభవి తండ్రి అశోక్ చౌదరి జేడీయూలో నేతగా ఉన్నారు.
శాంభవి లేడీ శ్రీరామ్ కాలేజ్(ఢిల్లీ యూనివర్సిటీ)లో గ్రాడ్యుయేషన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పీజీ పట్టా పొందారు. ప్రస్తుతం ఆమె బీహార్లోని మగధ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నారు. శాంభవి ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విద్య, వైద్య సేవలను మెరుగపరచడమే తన లక్ష్యమని తెలిపారు.