న్యూఢిల్లీ: లోక్సభ(Lok Sabha)లో ఇవాళ ఫైనాన్స్ బిల్లు(Finance Bill)కు ఆమోదం దక్కింది. 45 సవరణలతో ఆ బిల్లును ఆమోదించారు. ఒకవైపు అదానీ అంశంపై జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం ఫైనాన్స్ బిల్లును పాస్ చేసింది. ఇవాళ ఉదయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) లోక్సభలో ఫైనాన్స్ బిల్లు 2023ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. విదేశీ టూర్లకు క్రెడిట్ కార్డు పేమెంట్స్ విషయంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుదని ఆమె అన్నారు. ఫైనాన్స్ బిల్లు పాసైన తర్వాత లోక్సభను సోమవారానికి వాయిదా వేశారు.