AAP-Congress Alliance | ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు వరుస షాక్లు ఇస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఛండీగఢ్ లోక్సభ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, భగవంత్ మాన్ ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు.
పంజాబ్లో ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ మాట్లాడడం ఇదే తొలిసారి. లూథియానా జిల్లాలోని సమ్రాలాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల్లో మాట్లాడుతూ పలువురు నేతలు ఆప్తో పొత్తు పెట్టుకోవద్దని పంజాబ్కు చెందిన పలువురు నేతలు హైకమాండ్కు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే నష్టపోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతోందని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎక్కడా సమన్యాయం జరగడం లేదు.. పోరాడాల్సిందేనని కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలని సూచించారు.
ఒంటరిగా పోరాడాలని.. చివరి వరకు పోరాడి విజయం సాధించాలన్నారు. ఎవరైనా వచ్చినా ఫర్వాలేదు.. రాకపోయినా ఫర్వాలేదన్నారు. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇది కేవలం పంజాబ్కు సంబంధించినది కాదన్నారు. గట్టిగా పోరాడాలంటూ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ కార్యకర్తలకు గెలుపు మంత్రోపదేశం చేశారు. కాంగ్రెస్ గెలవాలంటే కార్యకర్తలు రంగంలోకి దిగాలన్నారు. ప్రజలను కలవాలని.. వారి అపోహలు తొలగిపోవాలన్నారు. ముందుగా ప్రజలు మధ్యలోకి వెళ్లాలని.. వారితో మాట్లాడాల్సి ఉంటుందని.. తాము ఏం చేశామో.. మోదీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు.