Kangana Ranaut | సిమ్లా, ఏప్రిల్2: బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ను హిమాచ ల్ ప్రదేశ్లోని మండీ నుంచి బీజేపీ అధిష్టానం ఎన్నికల బరిలో నిలపటం..ఆ రాష్ట్ర బీజేపీలో అసమ్మతిని పెంచింది. పార్టీకి చెం దిన సీనియర్ నాయకులు, కులూ రాజకుటుంబానికి చెందినవారు, వారి వారసులు ఆ మెకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. ఆమె ఎలా గెలుస్తుందో చూస్తామంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు.
పార్టీ అధిష్ఠానం చర్యను నిరసిస్తూ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి రా మ్లాల్ మర్కందా ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్, మూడు సార్లు ఎంపీ, కులూ రాజకుటుంబానికి చెందిన ప్రముఖుడు అయిన మహేశ్వర్ సింగ్ తాజాగా డిమాండ్ చేశారు.