న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని అధికార బీజేడీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరుగుతున్నది. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రంలో రూ.19,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. మరోవైపు దేశా న్ని ఆర్థిక శక్తిగా మార్చేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారంటూ నవీన్ పట్నాయక్ ప్రశంసలు కురిపించారు.