న్యూఢిల్లీ : దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చకు లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంగీకరించింది. లోక్సభలో రూల్ 193 ప్రకారం ఈ వారంలో చర్చ జరుగనున్నది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజకీయ పార్టీల సభ్యులతో కూడిన బిజినెస్ అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభలో చర్చకు తీసుకోవాల్సిన అంశాలను చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. అయితే, ఇంధన ధరల పెంపు అంశంపై లోక్సభ, రాజ్యసభలో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు నిరసన తెలుపగా.. సోమవారం రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. 15 మంది సభ్యుల బిజినెస్ అడ్వైజరీ సలహా కమిటీలో సుదీప్ బందోపాధ్యాయ, పీపీ చౌదరి, అధిర్ రంజన్ చౌదరి, సంజయ్ జైస్వాల్, పినాకి మిశ్రా ఉన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడుత ఈ నెల 14న ప్రారంభం కాగా.. వచ్చే 8వ తేదీతో ముగియనున్నాయి. మొదటి విడుతలో జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు జరిగాయి.