తిరువనంతపురం : కేరళలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తారానే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో లాక్డౌన్పై ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ శనివారం క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించడం లేదని తెలిపారు. లాక్డౌన్ సాధారణ జీవితంపై ప్రభావం చూపుతుందన్న ఆమె.. పౌరులంతా తప్పనిసరిగా కొవిడ్ నియమాలను పాటించాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రజల ఆర్థిక కార్యకలాపాలను ఇప్పుడు అడ్డుకోలేమని, పూర్తిస్థాయి లాక్డౌన్ను నివారించేందుకు కలిసి పని చేయాలన్నారు. ప్రస్తుతం ఎలాంటి లాక్డౌన్కు ప్రణాళిక చేయడం లేదని, కేంద్రం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా విదేశాల నుంచి వచ్చే వారి కోసం క్వారంటైన్ కోసం ప్రోటోకాల్స్ నిర్ణయించినట్లు వివరించారు. దాదాపు నెల రోజుల తర్వాత కేరళలో నిన్న 5వేలకుపైగా కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. శనివారం 5,944 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది.