లక్నో : కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి యూపీ సర్కార్ కీలక నిర్జయం తీసుకుంది. ఆదివారం అన్ని జిల్లాల్లో లాక్డౌన్ విధించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. మాస్క్ లేకుండా కనిపించిన వారికి రూ వేయి జరిమానా వేస్తామని స్పష్టం చేసింది. ఇక యూపీలో గురువారం ఒక్కరోజే 22,439 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
గత ఏడాది వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి ఒక రోజులో ఈస్ధాయిలో అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇక వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ ప్రకటించింది. రాత్రి ఎనిమిది గంటల నుంచి మరుసటి రోజు ఏడు గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.