కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఒక నగరంలో లాక్డౌన్ విధించారు. రాజధాని కోల్కతాకు 20 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్పూర్ మున్సిపాలిటీ ప్రాంతంలో కరోనా కేసుల పెరుగుదలపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. దసరా నేపథ్యంలో పోటా పోటిగా దుర్గా పూజా మండపాల ఏర్పాటుతో కోల్కతా పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు 25 శాతం మేర పెరిగినట్లు బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది. వైరస్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో సోనార్పూర్లో మూడు రోజుల పాటు లాక్డౌన్ను ప్రభుత్వం విధించింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చింది.