న్యూఢిల్లీ, జూలై 4: ఎక్సైజ్ రూల్స్ ప్రకారం అన్ని లిక్కర్ బాటిళ్లపై ఇప్పటికే ‘ఆరోగ్య హెచ్చరిక’ చేసే సంకేతం ఉన్నదని, చట్టాల మేరకు ఇది ఉంటుందే తప్ప.. వ్యక్తిగత అభిప్రాయం, ఇష్టం మేరకు ఉండదని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. ఇందుకు సంబంధించి శాసనం ఉన్నదని, దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసం సోమవారం స్పష్టం చేసింది. లిక్కర్లు బాటిళ్లు, ప్యాకింగ్లపై కూడా సిగరెట్టు ప్యాకెట్లపై ఉండే ఆరోగ్య హెచ్చరిక అక్షరాల సైజు అంత ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది అశ్వినికుమార్ పిల్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిల్ను తిరస్కరిస్తూ పై వ్యాఖ్యలు చేసింది.