భువనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) మాట్లాడుతుండగా లైట్లు ఆఫ్ అయ్యాయి. అయినప్పటికీ చీకటిలోనే తన ప్రసంగాన్ని ఆమె కొనసాగించారు. ముర్ము సొంత రాష్ట్రమైన ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. బరిపాడలోని మహారాజా శ్రీరామ చంద్ర భంజా డియో విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. దేశ ప్రథమ పౌరురాలైన ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఆమె ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా వేదికతోపాటు హాల్లో లైట్లు ఆగిపోయాయి. మైక్ పని చేయడంతో సుమారు 9 నిమిషాల పాటు చీకటిలోనే తన స్పీచ్ను కొనసాగించారు. మాతృభాష అయిన ఒడిషాలో ఆమె మాట్లాడారు.
కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తుండగా లైట్లు ఆఫ్ కావడంపై యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఎస్కే త్రిపాఠి క్షమాపణలు చెప్పారు. దురదృష్టకర సంఘటనగా పేర్కొన్న ఆయన తనను తాను నిందించుకున్నారు. ఈ సంఘటనపై సిగ్గుపడుతున్నట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు లైట్లు ఆఫ్ అయినప్పటికీ ద్రౌపది ముర్ము చీకటిలో ప్రసంగించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
VIDEO | President Droupadi Murmu continued her speech during the power outage at MSCB University in Mayurbhanj’s Baripada. pic.twitter.com/NSchUHbCzG
— Press Trust of India (@PTI_News) May 6, 2023