ఢాకా : బంగ్లాదేశ్లోని చపైనవాబ్గంజ్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెళ్లిబృందంపై పిడుగు పడి 16 మృతి చెందారు. వరుడికి తీవ్రగాయాలు కాగా వధువు క్షేమంగా బయటపడింది. వివాహానికి వచ్చిన బృందం పడవ దిగి నదీ సమీపంలోని షిబ్గంజ్ నగరంలో తమ విడిది ప్రాంతానికి వెళ్తుండగా ఉరుములతో కూడిన వర్షంలో పిడుగు పడింది.
దీంతో 16 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వధువు వీరితో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. బంగ్లాదేశ్లో ఇప్పటికే రుతువనాల ప్రభావంతో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య జిల్లా కాక్స్ బజార్లో ఆరుగురు రోహింగ్యా శరణార్థులతో సహా 20 మంది మృతి చెందారు. దక్షిణాసియాలో పిడుగుల కారణంగా యేటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే.