పాట్నా: బీహార్లో పిడుగులు(Lightning) పడి గడిచిన 24 గంటల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షా కాలం వల్ల బీహార్లో మెరుపులో,ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. వివిధ జిల్లాల్లో పిడుగుల వల్ల 18 మంది ప్రాణాలు కోల్పోయారు. రోహతాస్ జిల్లాల్లో అయిదుగురు, అర్వాల్లో నలుగురు, శరన్లో ముగ్గురు, ఔరంగబాద్లో ఇద్దరు, బంకా-వైశాలి జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. పిడుగుల వల్ల మృతిచెందిన బాధితులకు 4 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కోన్నది.
ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అభ్యర్థన చేసింది. గ్రామాల్లో ఉంటున్న ప్రజలు వర్షం కురుస్తున్నప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లోకి, పొలాల్లోకి వెళ్లవద్దు అని ఆ ఏజెన్సీ పేర్కొన్నది. కరెంటు పోల్స్, మట్టి ఇండ్ల వద్ద కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వర్షం పడుతున్న సమయంలో కిటికీల వద్ద ఉండవద్దు అని సూచించారు. ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రిక్ పరికరాలను వర్షం వేళ తాకరాదు అని డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.