న్యూఢిల్లీ, మే 24: సుప్రీంకోర్టు తనకు జైలు శిక్ష నుంచి ఉపశమనం కల్పించిందంటూ ఓ జీవిత ఖైదీ నకిలీ ఉత్తర్వులను సృష్టించాడు. ఫోర్జరీ చేసిన పత్రాలతో జైలు నుంచి బయటపడ్డాడు. దాదాపు ఎనిమిదేండ్లుగా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. దీనిపై ఫిర్యాదులు రావటంతో.. 8 ఏండ్ల తర్వాత జైలు అధికారులు రంగంలోకి దిగారు.
అతడిపై పోలీసులు ఫోర్జరీ, మోసం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మోసం.. కర్ణాటక జైళ్ల శాఖలో విధానపరమైన లోపాల్ని, అంతర్గత కుమ్మక్కులను బయటపెడుతున్నది. 2001 నాటి ఓ కిడ్నాప్ కేసులో శంకర్ దోషిగా తేలాడు.