న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు తదుపరి ఆర్మీ వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వైస్ చీఫ్గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్గా పదోన్నతి పొందనున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న ఎంఎం నరవణే పదవీ కాలం శనివారంతో ముగియనున్నది. కాగా, లెఫ్టినెంట్ జనరల్ రాజు ప్రస్తుతం మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. బీఎస్ రాజు కర్ణాటకకు చెందినవారు.