ముంబై: జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ఇవాళ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎల్ఐసీ షేర్లను ఇవాళ ఉదయం లిస్టింగ్ చేశారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ)లో ఇవాళ ఎల్ఐసీ ట్రేడింగ్ జరుగుతోంది. ఇటీవల ఎల్ఐసీలో ఐపీవో జరిగిన విషయం తెలిసిందే. ఒక షేర్ ధరను రూ.949గా నిర్ధారించారు. కానీ ఇవాళ బీఎస్ఈలో 8.62 శాతం డిస్కౌంట్తో ట్రేడింగ్ ప్రారంభమైంది. తాజా సమాచారం మేరకు బీమా సంస్థ షేర్లు రూ.912 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. లిస్టింగ్ చేసిన ధర కన్నా ఇది 5 శాతం ఎక్కువ. కానీ ఐపీవో జారీ చేసిన షేర్ ధర కన్నా తక్కువే అవుతుంది. ఇక ఎన్ఎస్ఈలో లిస్టింగ్ ధర రూ.872 ఉంది. షేర్పై 8.11 శాతం తక్కువగా ట్రేడింగ్ జరుగుతోంది.