న్యూఢిల్లీ: జీబితా బీమా సంస్థ ఐపీవోకు కేంద్రం రెఢీగా ఉన్నా.. అయితే ఆ ఐపీవో ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగేలా లేదు. ఉక్రెయిన్ యుద్ధం ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో.. ఎల్ఐసీ ఐపీవో మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లోనే ఎల్ఐసీ ఐపీవోను స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్లాలని కేంద్రం భావించిన విషయం తెలిసిందే. కానీ ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు, సంస్థ ప్రయోజనాల కోసం వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.
ఐపీవోకు అనుమతించాలని ఎల్ఐసీ దాఖలు చేసిన అప్లికేషన్ను స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదించింది. ఈ అనుమతి మే 12 వరకు అమలులో ఉంటుంది. అప్పట్లోగా మార్కెట్ పరిస్థితులను బట్టి ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లొచ్చు. ఈ గడువు దాటితే మాత్రం మళ్లీ సెబీ ముందు ఎల్ఐసీ మరోమారు ఐపీవోకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.